- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అంబర్పేట్లో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ) కేంద్రాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. నగరవ్యాప్తంగా రూ.4,739 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం 45 ఎస్టీపీల నిర్మాణం చేపడుతోంది. ఈ మేరకు డీపీఆర్లు రూపొందించింది. ఇప్పటికే పూర్తయిన ఆరు ఎస్టీపీలను సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మరో 39 కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మురుగునీటి శుద్ధి వ్యవస్థ గురించి జలమండలి ఎండీ అశోక్రెడ్డి సీఎంకు వివరించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -