- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి నేడు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేదా హైకోర్టులో తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా అనే దానిపై చర్చించనున్నట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను పూర్తిగా అధ్యయనం చేసి, న్యాయ నిపుణుల సూచన మేరకు తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
- Advertisement -