Friday, July 11, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షణీయం

సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షణీయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. ఈ మేరకు గురువారం ఆమె ‘ఎక్స్’ వేదికగా తన స్పందనను తెలియజేస్తూ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాన్ని సవరించి బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ వైఖరిని ఆమె ప్రశంసించారు. ఈ దిశగా అవసరమైన చర్యలను ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని ఆమె కోరారు.

ఈ నిర్ణయం తెలంగాణలోని బీసీల విజయమని కవిత అభివర్ణించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ జాగృతి సంస్థ మొదటి నుంచి బలంగా డిమాండ్ చేస్తోందని, క్యాబినెట్ తాజా నిర్ణయం తమ పోరాటానికి లభించిన స్పష్టమైన విజయమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కవిత జై బీసీ, జై జాగృతి అనే నినాదాలను తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -