- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరిలో స్విట్జర్లాండ్లో జరిగే WEFకు హాజరయ్యేందుకు అనుమతి కోరగా రూ.10 వేల పూచీకత్తుపై అనుమతించింది. మార్చి 3 లోపు పాస్పోర్టు తిరిగి అప్పగించాలని స్పష్టం చేసింది. 2015 ఓటుకు నోటు కేసులో బెయిల్ షరతుల ప్రకారం రేవంత్ పాస్పోర్టు కోర్టు అధీనంలో ఉంది. జనవరి 19-23 వరకు దావోస్లో సీఎం పర్యటించనున్నారు.
- Advertisement -



