- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్కు వెళ్లి రాహుల్, కేసీ వేణుగోపాల్, ప్రియాంకా గాంధీని కలవనున్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు జరిగిన గ్లోబల్ సమ్మిట్ వివరాలను వారితో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనా చర్చించే అవకాశముంది. బుధవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్న ఆయన NCP అధినేత శరద్ పవార్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
- Advertisement -


