- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం చంద్రబాబు మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలియజేస్తూ, ఘటనపై అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అన్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
- Advertisement -



