– చిన్న తరహా పరిశ్రమల సౌకర్యం కోసం ఏర్పాటు :సింగరేణి సీఎమ్డీ ఎన్ బలరాం వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
చిన్న తరహా పరిశ్రమల సౌకర్యం కోసం హైదరాబాద్ సమీపంలో బొగ్గు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నామని సింగరేణి సీఎమ్డీ ఎన్ బలరాం వెల్లడించారు. ఆయా పరిశ్రమల వారు తమకు కావలసిన తక్కువ మోతాదు బొగ్గును సింగరేణి ఏరియాలకు వచ్చి తీసుకెళ్లడం వెసులుబాటుటా లేదని గమనించామనీ, అందువల్ల హైదరాబాదుకు సమీపంలో ఒక బొగ్గు విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులని ఆదేశించారు. శనివారంనాడిక్కడి సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించడం కోసం ఇకపై సింగరేణి సంస్థ నుండి జీ-14, జీ-15 గ్రేడ్ల బొగ్గు రవాణాను పూర్తిగా నిలిపివేయాలని చెప్పారు. దానికి బదులు జీ-13 గ్రేడ్ బొగ్గును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. భూపాలపల్లి ఏరియాలోని భూగర్భ గనుల్లో మట్టి నింపేందుకు గోదావరి నది నుంచి ఇసుక సేకరణకు అవసరమైన క్వారీ అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘నీటి బిందువు జల సింధువు’ కార్యక్రమం ద్వారా 60 చెరువుల నిర్మాణాలు పూర్తయ్యాయనీ, మరో 43 చెరువుల్లో పూడికతీత పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అలాగే ‘ప్రతి అడుగు పచ్చదనం వైపు’ కార్యక్రమం ద్వారా ఈ ఏడాది సింగరేణి వ్యాప్తంగా 675 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు డీ సత్యనారాయణరావు, ఎల్వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్డీఎమ్ సుభాని తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సమీపంలో బొగ్గు విక్రయ కేంద్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES