– మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ పోస్టర్ ఆవిష్కరణలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రక్తదానం చేసి ప్రాణాలను నిలిపేందుకు ప్రజలు ముందుకు రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) కార్యాలయంలో చైర్మెన్ డాక్టర్ మహేశ్ కుమార్, వైస్ చైర్మెన్ డాక్టర్ శ్రీనివాస్, సభ్యులు డాక్టర్ సన్నీ డేవిస్ తదితరులు మెడికోస్ బ్లడ్ డోనర్స్ క్లబ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గత కొన్నేండ్లుగా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. ప్రతి మెడికల్ కాలేజీలో సమన్వయకర్తలతో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. రక్తదానం కోసం స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వైద్య విద్యార్థులను వారు అభినందించారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య విద్యార్థులను, యువతను పెద్దఎత్తున భాగస్వాములుగా చేయడమే తమ లక్ష్యమని వివరించారు.
రండి.. రక్తదానం చేద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES