– మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
నవతెలంగాణ – మిర్యాలగూడ
హామీలు నెరవేర్చని చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రవు పిలుపునిచ్చారు. గురువారం అడవిదేవులపల్లి మండలంలో ఉల్సాయిపాలెం, బాల్నేపల్లి, మొల్కచర్ల, బంగారికుంటతండా గ్రామాలలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ధనావత్ బాలాజీ నాయక్, కుర్ర సేవియా నాయక్, కొత్త మర్రెడ్డి, కుర్ర శ్రీను నాయక్, పెరుమాళ్ళ శ్రీనివాస్, కనిగిరి శ్రీను, స్వామి నాయక్, వర్త్య శివనాయక్, అంచ సాంబశివరావు, లచ్చు నాయక్, భిక్షా నాయక్, రామకోటి నాయక్, మేష్య నాయక్, చిన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ది చెప్పాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



