Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతినెలా రెండుసార్లు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతినెలా రెండుసార్లు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించనుంది. ప్రతి 15 రోజులకోసారి మంత్రివర్గం భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి నిర్ణయించారు. విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు, మూడు నెలలకోసారి కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా క్యాబినెట్‌‌లో సమీక్ష చేయనున్నారు. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రివర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -