నవతెలంగాణ -రామగిరి
రామగిరి మండలం ఆదివారంపేట గ్రామనికి చెందిన మాజీ జడ్పీటీసీ మైదం భారతి వరప్రసాద్ తల్లి “లల్తవ్వ” ప్రథమ వర్ధంతి ఆదివారం జరిగింది. మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని లల్తవ్వ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగ నివాళులర్పించారు.అనంతరం లల్తవ్వ కుమారులు మైదం వరప్రసాద్,మైదం మహేష్,మైదం నాగేశ్వర్, అలాగే మైదం వేణులను పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, నాగేపల్లి మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, పొన్నం సత్యనారాయణ అదేవిధంగా పరామర్శించిన వారిలో అంతర్గాం తాహసిల్దార్ తూం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
“లల్తవ్వ” ప్రథమ వర్ధంతికి హాజరైన కాంగ్రెస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



