– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నాడు తమ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలైతే, నేడు రేవంత్ విధానం నిందలు, దందా లు, చందాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణకు గులా బీజెండానే గుండె ధైర్యం అని ప్రకటించారు. గద్వాలకు ఉపఎన్నిక రావడం ఖాయమనీ, అక్కడ కూడా గులాబీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గద్వాల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్లో కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంద రూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చా రు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మ్యానిఫెస్టో అని విమర్శించా రు. రేవంత్ రెడ్డి గత పద్దెనిమిది నెలలుగా ప్రధాన ప్రతిపక్షంపై పనికిరాని నిందలు, బిల్డర్లు – కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు పంపడమే విధానంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఉత్త మాటల మనిషి మాత్రమే కాదన్న కేటీఆర్, ఆయన ఢిల్లీకి మూటలు మోసే మనిషిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు చంద్రబాబు కోసం మూటలు మోసి అడ్డంగా దొరికిపోయారనీ, ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మండిపడ్డారు. ఎప్పుడు ఎవరిని బెదిరించాలి, ఎవరిని దోచుకోవాలి, ఢిల్లీకి దోచుకున్న సొమ్ము ఎలా పంపాలనే ఆలోచన తప్ప, తెలంగాణపై పట్టింపు లేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఒట్టు వేశారనీ, రూ.49 వేలా 500 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే చివరకు పావుశాతం కూడా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భయంకరమైన మానసిక వ్యాధితో రేవంత్ రెడ్డి బాధపడుతున్నట్టు కనిపిస్తోందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మోసాన్ని, బీజెపి నయవంచనను ఊరూరా తీసుకపోవాల్సిన బాధ్యత గులాబీ సైనికులం దరి మీద ఉందన్నారు. వలస ప్రాంతంగా ముద్రపడ్డ పాలమూరు ముఖచిత్రాన్ని కేసిఆర్ సమూలంగా మార్చివేశారని కేటీఆర్ తెలిపారు. ఆంధ్ర, కర్ణాటక నుంచి పదేండ్ల పాలనలో రివర్స్ మైగ్రేషన్ సాగిందని గుర్తుచేశారు. గులాబీ జెండా కింద గెలిచిన ఎమ్మెల్యే మోసం చేసి వెళ్లినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్తోనే ఉన్నారని స్పష్టం చేశారు. త్వరలో గద్వాలకు కూడా ఉపఎన్నిక రావడం ఖాయమనీ, వచ్చే ఉప ఎన్నికల్లో సామాన్య కార్యకర్తను పెట్టినా అక్కడ గులాబీ జెండాను ఎగరవేస్తామని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన సన్నాసులకు వచ్చే ఉపఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు. కేసిఆర్ హయాంలో గద్వాలను జిల్లా చేసి పరిపాలనను ప్రతి గడపకు చేరువ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. రాజోలి బండ డైవర్షన్ స్కీం కోసం ఆలంపూర్ జోగులాంబ నుంచి ఆర్డీఎస్ వరకు పార్టీ పెట్టిన కొత్తలో కేసీఆర్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. జూన్ నెలలో పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ మొదలవుతుందని కేటీఆర్ వెల్లడించారు.
శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మ్యానిఫెస్టో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES