- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం మంజూరు చేయడం జరుగుతుందని టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్ నర్సు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -