Wednesday, June 25, 2025
E-PAPER
Homeఖమ్మంప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలి 

ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలి 

- Advertisement -

– వైద్యాధికారి కె.వి.సంఘమిత్ర 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : వర్షాకాలం కాలం సీజన్ లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్.. వంటి విష జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వాటిని దృష్టిలో ఉంచుకుని జ్వరం వచ్చిన వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని స్థానిక పి.హెచ్.సి వైద్యాధికారి కె.వి సంఘమిత్ర ప్రజలకు సూచించారు. ఈ మేరకు ఆమె బుధవారం  మండల పరిధిలో మర్కోడు సబ్ సెంటర్ లోని పాతూరు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్ లు, ఆశాలు కలిసి గ్రామంలో ప్రతీ ఇంటికి తిరిగి జ్వరాల సర్వే నిర్వహించారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో మొత్తం 54 మంది రోగులను పరీక్షించి, తగిన మందులు ఇచ్చామన్నారు. పరిసరాల పరిశుభ్రత గురించి, డ్రై డే – ఫ్రై డే గురించి ప్రజలకు చెప్పామన్నారు. అదేవిధంగా వర్షాకాలంలో జ్వరాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పి.హెచ్.సి హెల్త్ ఎడ్యుకేటర్ టి.రమాదేవి హెల్త్ అసిస్టెంట్ లు ఎం.నరేష్, శ్రీధర్ బాబు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -