- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ.. టాటా ఏస్ వాహనం, మూడు బైకులను ఢీకొట్టి, అనంతరం చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
- Advertisement -



