- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని శామీర్ పేట్ ఓఆర్ఆర్ పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగ్జిట్ -7 వద్ద ఆపి భోజనం చేస్తున్న వారిపైకి కంటైనర్ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మౌలాలికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న శామీర్ పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు.
- Advertisement -



