Tuesday, June 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్కిల్‌ యూనివర్సిటీ అభివృóద్ధికి సహకరించండి

స్కిల్‌ యూనివర్సిటీ అభివృóద్ధికి సహకరించండి

- Advertisement -

– కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరికి శ్రీధర్‌ బాబు విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్‌ చౌదరిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. సోమవారం మినిస్ట్రీఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా), డిప్టారెంట్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌(తెలంగాణ) సంయుక్తంగా బషీర్‌బాగ్‌లోని పీజీ లా కళాశాలలో ఏర్పాటు చేసిన ”మెగా జాబ్‌లోన్‌ మేళా”ను కేంద్రమంత్రితో కలిసి ఆయన ప్రారంభించారు. తెలంగాణను ”స్కిల్‌ కేపిటల్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌”గా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు శ్రీధర్‌బాబు తెలిపారు. ఇంజినీరింగ్‌ పట్టభద్రుల్లో చాలా మందికి తగిన నైపుణ్యం ఉండటం లేదని చెప్పారు. ”నైపుణ్యాభివృద్ధిలో పరిశ్రమలు, నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నాం. వారి సహకారంతోనే స్కిల్‌ యూనివర్సిటీలో కోర్సులకు రూపకల్పన చేస్తున్నాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న యువతలో 80 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి” అని వివరించారు. ”మీలో ఎంతో ప్రతిభ ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు మారాలి. టెక్నాలజీ సాయంతో కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు ప్రయత్నించండి. ఓటమికి నిరుత్సాహం చెందకుండా ప్రయత్నం చేస్తూనే ఉండండి. తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు” అని యువతకు సూచించారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని సందర్శించాలని కేంద్ర మంత్రిని శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మెన్‌ అనిల్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -