Monday, July 7, 2025
E-PAPER
Homeజాతీయంనీట‌మునిగిన స‌హ‌కార బ్యాంకు..ఆందోళ‌న‌లో ఖాతాదారులు

నీట‌మునిగిన స‌హ‌కార బ్యాంకు..ఆందోళ‌న‌లో ఖాతాదారులు

- Advertisement -


నవతెలంగాణ-హైద‌రాబాద్: హిమాచల్‌ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. (Bank Buried In Water) లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

జూన్‌ 20 నుంచి జూలై 6 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాన్ని 23 ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వర్షాలు, వరదలకు మండి జిల్లా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో తునాగ్‌ మార్కెట్‌ ప్రాంతంలోని రెండతస్తుల బిల్డింగ్‌లో ఉన్న రాష్ట్ర సహకార బ్యాంకు వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. నీటి ప్రవాహం ఉధృతికి ఒక షట్టర్ పైకి లేచింది. మరో రెండు షట్టర్‌లు వంకరపోయాయి.

మరోవైపు వరద నీటి వల్ల ఆ బ్యాంకులోని లక్షలాది నగదుతోపాటు లాకర్లలో ఉన్న నగలు, డబ్బు, ఇతర పత్రాలు పాడై ఉంటాయని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు. కోట్లలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యాపారులు, కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. వరదల వల్ల ఆ బ్యాంకు నుంచి కొట్టుకుపోయిన విలువైన వస్తువులు చోరీ కాకుండా ఉండేందుకు స్థానికులు అక్కడ కాపలా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -