Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతి రాజ్యంఏలుతుంది.

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతి రాజ్యంఏలుతుంది.

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర : ఇందిరమ్మ ఇండ్ల పథకం లో అవినీతి రాజ్యం ఎలుతుందని,ఇది ప్రజా పాలన కాదు ప్రజలను దోచుకునే పాలన అని నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ అన్నారు. బుధవారం నాగార్జున సాగర్ నియోజకవర్గం గుర్రంపోడ్ మండలం పాల్వాయి గ్రామంలో పర్యటించి ఇల్లు లేని పేద కుటుంబాలతో మాట్లాడారు.పాల్వాయి గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు కేసీఆర్ సభకు వెళ్లాడని వచ్చిన ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ నాయకులు తీసివేయడం దారుణమని అన్నారు.

నియోజకవర్గంలో పేదలను పక్కనపెట్టి ఎమ్మెల్యే అనుచరులకే ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేశారని అన్నారు.అర్హులైన పేదలు అధికారుల వద్దకు వెళ్లి లిస్ట్ లో వచ్చిన ఇల్లు ఎలా తీసివేశారని
అడిగితే మా చేతిలో ఏమి లేదు అని చేతులెత్తేయడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితినేలకొందని అన్నారు.కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్లను తప్పుదారి పట్టిస్తూ ఇళ్ల మంజూరు జాబితాలో అర్హులైన పేదవారిని తొలగించి, వారికి అనుకూలమైన వారిని ఇండ్లు పెట్టిస్తున్నారన్నాని,ఇలా చేయడం ద్వారా నిజమైన పేదలు నష్టపోతున్నారు అని మడిపడ్డారు.

స్థానిక ఎమ్మెల్యేకు పేద ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే గ్రామాలలోకి వచ్చి అర్హులైన పేదలను గుర్తించి వారికి ఇండ్లు వచ్చేలా చూడాలన్నారు.పేదలకు ఇండ్లు ఇవ్వకుండా చిల్లర చేష్టలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు, మాజీ వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, మండల సీనియర్ నాయకులు మేకల వెంకట్ రెడ్డి, మారపాక వెంకటయ్య మారపాక పరమేష్, చింత రెడ్డి రవీందర్ రెడ్డి,పంగ పరమేశ్,మేడి లింగయ్య,టోనీ,బొమ్ము ఆంజనేయులు,పోలె పల్లి యాదయ్య,దోటి భూషాలు,దోటి రవి,తదితరులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -