- Advertisement -
నవతెలంగాణ – చెన్నై: ‘కోల్ట్రిఫ్’ దగ్గు మందు వికటించి ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 22 మంది పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కోల్డ్రిఫ్ సిరప్ తయారీకి సంబంధించిన లైసెన్స్ను పూర్తిగా రద్దు చేసింది. దీన్ని తయారు చేస్తున్న తమిళనాడులోని శ్రీసన్ ఫార్మా కంపెనీని మూసివేస్తున్నట్లు తెలిపింది.
- Advertisement -