- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మేడారం సమ్మక్క-సారక్క జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఐదోరోజు ఆలయ సిబ్బంది 163 హుండీలను లెక్కించారు. వీటి ద్వారా రూ.1.12 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు మొత్తం 788 హుండీలను లెక్కించగా.. రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన హుండీల లెక్కింపునకు మరో రెండ్రోజులు పట్టవచ్చని ఆలయ సిబ్బంది తెలిపారు. నోట్ల లెక్కింపు పూర్తయ్యాక బంగారం, వెండి వస్తువుల విలువను నిర్ధరించనున్నారు.
- Advertisement -



