ఇటీవల విడుదలైన ‘కుబేర’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక మందన్న తాజాగా ‘మైసా’ చిత్రంతో సర్ప్రైజ్ చేయబోతున్నారు. ఆమె గత చిత్రాలకు పూర్తి భిన్నంగా నెవర్ బిఫోర్ పాత్రలో రష్మికని చూడబోతున్నా రంటూ ‘మైసా’ పోస్టర్ రిలీజ్తో మేకర్స్ చెప్పకనే చెప్పారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన అద్భుతమైన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్కి ”మైసా’ అనే పవర్ ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. అజరు, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో హై బడ్జెట్తో నిర్మించనున్నారు. సాయి గోపాల్ సహ నిర్మాత. దర్శకుడు హను రాఘవపూడి తెలుగు లుక్, పోస్టర్ను లాంచ్ చేశారు. ధనుష్ తమిళ పోస్టర్, విక్కీ కౌశల్ హిందీ పోస్టర్ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ మలయాళ పోస్టర్ను, శివరాజ్ కుమార్ కన్నడ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘మైసా’ అనేది రెండు సంవత్సరాల కష్టం ఫలితం. కథ, ప్రపంచం, కళా దక్పథం, పాత్రలు, ప్రతీ అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇప్పుడు ఈ కథను ప్రపంచానికి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని దర్శకుడు రవీంద్ర పుల్లె తెలిపారు. ‘ఓర్పు ఆమె ఆయుధం. ఆమె గర్జన.. వినిపించేందుకు కాదు భయపెట్టడానికి. రష్మిక మందన్నను మైసా పాత్రలో చూడండి. ఆమె ఫియర్స్ అవాతర్ ఇదే’ అని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
నేను ఎప్పుడూ కొత్తది, భిన్నమైనది, ఉత్తేజకరమైన చిత్రాలకు ప్రాధాన్య మిస్తాను. ‘మైసా’ అలాంటి వాటిల్లో ఒకటి. నేను ఇంతక ముందెప్పుడూ పోషించని పాత్ర. ఎప్పడూ అడుగు పెట్టని ప్రపంచం. ఇప్పటి వరకూ చేయని వెర్షన్. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఇది అరంభం మాత్రమే.
– హీరోయిన్ రష్మిక మందన్న
ధైర్యం ఆమె బలం సంకల్పంలో లేదు కనికరం..
- Advertisement -
- Advertisement -