Monday, June 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆరువేల మార్క్‌ను దాటిన కొవిడ్‌ కేసులు

ఆరువేల మార్క్‌ను దాటిన కొవిడ్‌ కేసులు

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ :   దేశవ్యాప్తంగా కొవిడ్‌ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,000 మార్క్‌ను దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. కొత్తగా 6,133 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లో ఆరు మరణాలు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. 48గంటల్లో 769 కొత్త కేసులు నమోదవగా, కేరళ మొదటి స్థానంలో ఉందని తెలిపింది. గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ తరువాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుండి దేశంలో 65 మరణాలు నమోదుకాగా, మే 22 నాటికి దేశంలో మొత్తం 257 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్రం దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ను నిర్వహిస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆక్సీజన్‌, ఐసోలేషన్‌ బెడ్‌లు, వెంటిలేటర్లు మరియు అవసరమైన మెడిసెన్స్‌ను అందుబాటులో ఉండేలా చూడాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -