- Advertisement -
నవతెలంగాణ – ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. వారం రోజుల్లో నగరంలో వందకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్ మళ్లీ పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి చేరినట్లు కేంద్ర కొవిడ్-19 సమాచార నివేదిక వెల్లడించింది. ఒక్క ఢిల్లీలోనే 104 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 99 కేసులు గత వారం రోజుల్లోనే నమోదవడం గమనార్హం.
- Advertisement -