నవతెలంగాణ -పరకాల
పరకాల పురపాలక పరిధిలోని 13వ వార్డులో సీపీఐ(ఎం) అభ్యర్థి బొచ్చు సుమలత రాజు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బుధవారం వార్డులోని పలు వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ.. ఎర్రజెండా అండతోనే సామాన్యుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆమె ప్రజలకు వివరించారు.ప్రచారంలో భాగంగా సుమలత రాజు మాట్లాడుతూ, వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఎద్దడి, వీధి దీపాల వంటి మౌలిక వసతుల కల్పనలో గత పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడేది ఒక్క సిపిఎం మాత్రమేనని, తనను గెలిపిస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుండే ఎర్రజెండాను ఆదరించాలని, మీ అమూల్యమైన ఓటును సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
13వ వార్డులో హోరెత్తుతున్న సీపీఐ(ఎం) ప్రచారం
- Advertisement -
- Advertisement -



