Friday, October 3, 2025
E-PAPER
Homeజిల్లాలులోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు సీపీఐ(ఎం) సిద్ధం

లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు సీపీఐ(ఎం) సిద్ధం

- Advertisement -
  • సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం

నవతెలంగాణ-మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలోని ఎంపీటీసీ , సర్పంచ్ అన్ని స్థానాలలో సీపీఐ(ఎం) పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం తెలిపారు . శుక్రవారం మండలంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించే సీపీఐ(ఎం)కు పోటీ చేసే స్థానాలలో గెలిపించేందుకు పేద ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. ప్రజలను మోసం చేసేందుకు వచ్చే ప్రజాప్రతినిధులు డబ్బులతో ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకునేందుకు వచ్చిన వారికి ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని అన్నారు. ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా నెత్తి పోరాటం చేసిన నాయకులకు ప్రజలలో మంచి ఆదరణ ఉన్నదని అన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో ఎర్ర జెండా కున్న పోరాట చరిత్ర ప్రజలలో చెదరని ముద్రగ నిలిచి ఉంటుందని అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యమైన ప్రజలని అన్నారు. డబ్బు, మద్యంతో ప్రలోభ పెట్టే బరిలో నిలిచే నాయకులను ఓడించి, పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసే సిపిఎం నాయకులను గెలిపించాలని కోరారు.

నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు పోరాటం చేసే ఎర్రజెండాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, మాజీ ఎంపీటీసీలు చాపల మారయ్య, టి గోపాల్ రెడ్డి, మునుగోడు, మర్రిగూడ, చండూరు, మండల కార్యదర్శిలు సాగర్ల మల్లేష్, ఏర్పుల యాదయ్య, జేరిపోతుల ధనంజయ గౌడ్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాస రాణి శ్రీను తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -