నవతెలంగాణ-హైదరాబాద్: జూన్ 10,11 తేదీల్లో సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటించనుందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి తెలిపారు. ఇటీవల ఈ ప్రతినిధి బృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటించాల్సి ఉండగా పరిస్థితుల రీత్యా, శ్రీనగర్కు విమానాలు రద్దు కావడంతో పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలో జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశంలో చర్చల తర్వాత కొత్త తేదీలను ప్రకటించారు. ఎంఏ బేబితో పాటు, రాజస్థాన్కు చెందిన పొలిట్బ్యూరో సభ్యుడు, లోక్సభ సభ్యుడు అమ్రా రామ్, కేంద్ర కమిటీ సభ్యుడు, ఎంపీ కె.రాధాకృష్ణన్, రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్, తమిళనాడుకు చెందిన ఏఏ రహీమ్ ఎంపీ, లోక్సభ సభ్యుడు సు వెంకటేశన్ ఈ బృందంలో ఉంటారు. కేంద్ర కమిటీ సభ్యుడు, కుల్గాం ఎమ్మెల్యే ముహమ్మద్ యూసుఫ్ తరిగామి నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర కమిటీ పర్యటనకు ప్రణాళికలు రూపొందించనున్నారు. హింస జరిగిన ప్రాంతాలను ప్రతినిధి బృందం సందర్శించి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఓదార్చనుంది. వివిధ రాజకీయ నాయకులు, పార్టీ సభ్యులతో చర్చలు జరుగుతాయని ఎంఏ బేబి పేర్కొన్నారు.
జమ్మూలో సీపీఐ(ఎం) పర్యటన..పహల్గాం బాధితులకు పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES