- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. కేవలం నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి 6 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3-4 గంటల్లో స్వామివారి దర్శనం జరుగుతుందని టీటీడీ పేర్కొంది. కొత్తగా కంపార్టుమెంట్లలోకి వెళ్లేవారికి దర్శనానికి 6-8 గంటల సమయం పట్టవచ్చని తెలిపింది. రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుంది.
- Advertisement -



