- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 8.36% పెరిగి 103 డాలర్లకు చేరుకుంది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 8.2% పెరిగి $104.57 వద్ద నమోదయ్యాయి. యూరోపియన్ గ్యాస్ ఫ్యూచర్స్ ధరలు 18% వరకు పెరిగాయి. ఇరాన్ పోర్టులకు నౌకల రాకపోకలను నిలిపివేస్తామని అమెరికా హెచ్చరించడంతో, ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
- Advertisement -



