- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయివేట్ స్కూల్లో నలుగురు టీచర్లు, ఓ ప్యూన్ 12 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగికదాడి చేసినట్లు సమాచారం. ఇంట్లో ఒంటరిగా ఏడుస్తున్న కూతురిని తల్లి ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



