Saturday, May 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హన్మాపురంలో దళితులకు పట్టా దారు పాసుబుక్కులు ఇవ్వాలి….

హన్మాపురంలో దళితులకు పట్టా దారు పాసుబుక్కులు ఇవ్వాలి….

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని  హన్మాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 87లోని 15 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకుంటున్న14 దళిత (మాదిగ) కుటుంబాలకు వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం  పట్టాదారు పాసుబుక్కుల సాధన కమిటి ఆధ్వర్యంలో భువనగిరి మండల తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసిన అనంతరం తహశీల్దార్ యన్ అంజిరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ భువనగిరి మండల పరిధిలోని హన్మామాపురం గ్రామంలోని సర్వేనెంబర్ 87లోని 15 ఎకరాల 12 గుంటల భూమిని గత 60, 70 సంవత్సరాలుగా 14 దళిత కుటుంబాలు ప్రభుత్వ భూమిని సేద్యం చేసుకొని బతుకు తున్నారని అన్నారు.

ఆనాటి నుండి నేటి వరకు అనేకమార్లు ప్రభుత్వ అధికారులకు, స్థానిక శాసనసభ్యులకు, మంత్రులకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని, సేద్యం చేసుకున్నట్లు రికార్డులో పేర్లు నమోదు చేయాలని దరఖాస్తులు పెట్టుకొని ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నా నేటికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా వెంటనే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని నర్సింహ డిమాండ్ చేశారు. ఆ భూమిని చదును చేయడానికి వేలాది రూపాలు ఖర్చు చేశారని, బాయి తవ్వి వ్యవసాయం కూడా చేశారని అన్నారు. ఇప్పటికి ప్రతి సంవత్సరం పత్తి, కంది, పెసర్లు, జొన్న, సజ్జలు, ఉలవలు పండిస్తున్నారని అన్నారు. ఆ భూముల మీద ఆధారపడి 14 కుటుంబాలు 36 మంది ఉన్నారని ఇప్పటికైనా కబ్జా కాలంలో, కాస్త కాలంలో పేర్లు నమోదు చేసి వారందరికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ భూమి చుట్టుపక్కల ఉన్న వారు  ఆ భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆక్రమ దారుల నుండి ఆ భూమిని కాపాడి సర్వే చేసి హద్దురాళ్ళు కూడా పెట్టాలని  కోరారు.

   ఈ కార్యక్రమంలో జియంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నర్సింహ్మ , తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, పట్టాదారు పాసుబుక్కుల సాధన కమిటీ కన్వీనర్ మూడుగుల బాల్ రాజు, కో- కన్వీనర్ మూడుగుల పరమేష్, సాగుదారులు మూడుగుల బాల్ నర్సింహ, మూడుగుల రమేష్ , మూడుగుల ఉపేందర్, బుచ్చాల కొండలు, బండారి సుధాకర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -