- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని అల్లీపూర్ గ్రామంలో శివాజీ విగ్రహం వెనుక వైపు తారు రోడ్డును ఆనుకొని ఉన్న సిమెంట్ దిమ్మె ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు అతి సమీపంలో సిమెంట్ దిమ్మె ఉండటంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, రైతులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దిమ్మె స్పష్టంగా కనిపించక ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, రోడ్డును ఆనుకొని ఉన్న సిమెంట్ దిమ్మెను తొలగించి ప్రమాదాలను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



