- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల బీ కేటగిరీ సీట్ల భర్తీ గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి మరోసారి పొడిగించింది. తొలుత ఆగస్టు 10 నాటికి సీట్ల భర్తీని పూర్తి చేయాల్సి ఉండగా ఆగస్టు 18 వరకు పెంచింది. తాజాగా వర్షాలు, సెలవుల కారణంగా ఆ గడువును ఆగస్టు 25వ తేదీ వరకు పొడిస్తున్నట్లు ప్రకటించింది. ప్రవేశాలు పొందిన విద్యార్థుల జాబితాను ఆయా కళాశాలలు ఆగస్టు 30 నాటికి ఉన్నత విద్యామండలికి అందజేయాలని పేర్కొంది.
- Advertisement -