- Advertisement -
నవతెలంగాణ- కంఠేశ్వర్
నగరంలోని నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ బుధవారం తెలిపారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో నిజామాబాద్ నందు బోర్గాం బస్ స్టాండ్ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి వయస్సు 55నుంచి 60 సంవత్సరాలు, నీలం రంగు ఫుల్ షర్ట్, గోధుమ రంగు ఫుల్ డ్రాయర్ ధరించి చనిపోయి ఉన్నాడు. గత 03 రోజుల నుండి ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ రోడ్డుపై పడుకుంటున్నాడు. ఇతనికి సంబంచిన సమాచారం ఎవరికైనా తెలిసినచో 4 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ నెంబర్లకు 8712659840, 8712659719 సంప్రదించాలన్నారు.
- Advertisement -