- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ జితేందర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డీజీపీ జితేందర్ తల్లి కృష్ణ గోయల్ (85) అనారోగ్యంతో కన్నుమూశారు. అనారోగ్య సమస్య కారణంగా ఆమెను హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించగా.. ఇవాళ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక, రేపు (శనివారం) జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -