- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్, కవిత తదితరులకు రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్టు తన తీర్పులో సీబీఐ అధికారులపై చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది. అదేవిధంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
- Advertisement -



