Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్డెంగ్యూ వ్యాధిని సమూలంగా నిర్మూలించాలి

డెంగ్యూ వ్యాధిని సమూలంగా నిర్మూలించాలి

- Advertisement -

– కాటాపూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రంజిత్
– ఘనంగా జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం
నవతెలంగాణ -తాడ్వాయి : డెంగ్యూ వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని, భాగస్వామ్య పద్ధతులు ఉపయోగించడం ద్వారా డెంగ్యూ వ్యాధిని సమూలంగా నిర్మూలించవచ్చని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేముల రంజిత్ అన్నారు.  కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యాధికారి డాక్టర్ రంజిత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో, గ్రామస్తులతో కలిసి శుక్రవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి రంజిత్ మాట్లాడుతూ దోమ.. పుట్టకుండా.. కుట్టకుండా చర్యలు తీసుకుని, డెంగ్యూ వ్యాధి రాకుండా నివారణకు తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు వివరించారు.అలాగే వ్యాధి నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలప్తె ఆరోగ్య అవగాహన కల్పించారు. దోమల నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. లార్వా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా, మురికి గుంటలు ఏర్పడ కుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమతెరలు కూడా వాడాలని సూచించారు. ప్రతీ శుక్రవారం ” డ్రైడే-ఫ్రైడే” గా పాటించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ సంతోషి, ఫార్మసిస్ట్ శివరంజని, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీధర్, హెల్త్ అసిస్టెంట్లు ముత్తయ్య, అనిల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -