- Advertisement -
నాలుగు కోట్ల విలువైన భూమి
రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి దానం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ శాఖకు నాలుగు కోట్ల విలువైన భూమిని రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి దానం చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని రెండువేల గజాల భూమి, అందులో భవనానికి సంబంధించిన పత్రాలను శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. సమావేశంలో కమిషన్ సభ్యులు గోపాల్రెడ్డి, భవానీరెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, అడిషనల్ డైరెక్టర్ విజరుకుమార్, కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్, ఏవో హరి వెంకట ప్రసాద్ తదితరులు ఉన్నారు.
- Advertisement -