Saturday, June 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి సదస్సులు డిప్యూటీ తహసీల్దార్

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి సదస్సులు డిప్యూటీ తహసీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని భూ సమస్యల నుండి స్వీకరించే దరఖాస్తులను చట్ట పరిధిలో ఉన్న వాటిని పరిష్కరింపబడతాయని మండల డిప్యూటీ తహసీల్దార్ శివరామకృష్ణ తెలిపారు. మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో శుక్రవారం నాడు భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వ్యవసాయదారుల నుండి భూ సమస్యల పరిష్కారానికి అందజేసిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సదస్సు గ్రామపంచాయతీ ఆవరణంలో నిర్వహించగా గ్రామ కార్యదర్శి నవీన్, ఆర్ ఐ శంకర్, రెవిన్యూ అధికారులు, సిబ్బంది ఆ గ్రామ నాయకులు, శంకర్ పటేల్, మాజీ ఉపసర్పంచ్, నాయకులు రాజు, దత్తు పటేల్, వ్యవసాయదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -