Saturday, June 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌సంస్థల్ని అభివృద్ధి చేయండి

విద్యుత్‌సంస్థల్ని అభివృద్ధి చేయండి

- Advertisement -

– డైరెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థల్ని అభివృద్ధి పథంలో నడపాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దీనికోసం విద్యుత్‌ సంస్థల్లో నూతనంగా నియమితులైన డైరెక్టర్లు అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇస్తామన్నారు. శుక్రవారం ప్రజాభవన్‌లో విద్యుత్‌ సంస్థల నూతన డైరెక్టర్లు, అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుతం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సహా అన్ని రకాల సబ్సిడీల కోసం దాదాపు రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తున్నామనీ, భవిష్యత్‌లో ఈ ఖర్చు రూ.17వేల కోట్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. విద్యుత్‌ ఒప్పందాల అమలుపై రోజువారీ సమీక్షలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు, ప్రణాళికలు, పునరుత్పాదక ఇంథనం ప్రాధాన్యత తదితర అంశాలపై మాట్లాడారు. సమావేశంలో విద్యుత్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్‌ మిట్టల్‌, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ కృష్ణ భాస్కర్‌, జెన్‌కో సీఎమ్‌డీ హరీశ్‌, రెడ్కో వీసీఎమ్‌డీ అనీల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -