‘కుబేర’ తర్వాత హీరో ధనుష్ నటిస్తున్న కొత్త సినిమా గురువారం ప్రారంభమైంది. ఇది ఆయన నటిస్తున్న 54వ చిత్రం. విఘ్నేష్ రాజా దర్శకుడు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో థింక్ స్టూడియోస్ సహకారంతో డాక్టర్ ఇషారి కె. గణేష్ నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో సినిమా ఆరంభం కావడంతోపాటు రెగ్యులర్ షూటింగ్ని కూడా ప్రారంభించారు. అనౌన్స్ మెంట్ పోస్టర్లో ధనుష్ పవర్ఫుల్ లుక్లో కనిపిస్తున్నారు. విలక్షణమైన కథాంశంతో కూడిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
ధనుష్ సరసన మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. కెఎస్ రవికుమార్, జయరామ్, కరుణాస్, సూరజ్ వెంజరమూడు, పథ్వీ పాండియరాజన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మల్టిఫుల్ లోకేషన్స్లో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం: విఘ్నేష్ రాజా, నిర్మాత: డాక్టర్ ఈశారి కె గణేష్, రచయితలు: ఆల్ఫ్రెడ్ ప్రకాష్, విఘ్నేష్ రాజా,
సంగీతం: జివి ప్రకాష్ కుమార్, డిఓపి: తేని ఈశ్వర్, ఎడిటర్: శ్రీజిత్ సారంగ్, ఆర్ట్ డైరెక్టర్: మాయాపాండి.
ధనుష్ నయా సినిమా షురూ..
- Advertisement -
- Advertisement -