- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి కామన్సైన్ అనే ప్రయివేట్ సంస్థ డైరెక్టర్ ధాత్రి మధును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారు.
- Advertisement -