Monday, June 30, 2025
E-PAPER
Homeసినిమాకొత్తవారికి సరైన వేదిక 'దిల్‌ రాజు డ్రీమ్స్‌'

కొత్తవారికి సరైన వేదిక ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’

- Advertisement -

‘కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఇండిస్టీలోకి రావాలని ఉంటుంది. వాళ్లకి సరైన గైడెన్స్‌ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వచ్చిన ఆలో చనే ఈ దిల్‌ రాజు డ్రీమ్స్‌. ఇండిస్టీలోకి రావాలనుకునే వారికి సరైన వేదిక అవుతుందనే ఆలో చనతో దిల్‌ రాజు డ్రీమ్స్‌ వెబ్‌ సైట్‌ ని లాంచ్‌ చేస్తున్నాం’ అని అన్నారు నిర్మాత దిల్‌ రాజు. దిల్‌ రాజు డ్రీమ్స్‌ వెబ్‌ సైట్‌ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. హీరో విజరు దేవరకొండ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరై, వెబ్‌ సైట్‌ని లాంచ్‌ చేశారు. విజరు దేవరకొండ మాట్లాడుతూ,’ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు. దిల్‌ రాజు డ్రీమ్స్‌ని దిల్‌ రాజుకి ఎందుకు లాంచ్‌ చేయాలని అనిపించిందో నాకు తెలియదు. కానీ ఇది లక్షలాది మందికి ఒక నమ్మకాన్ని ఇచ్చింది. అవకాశం గురించి చూస్తున్న ప్రతి ఒక్కరికి నా బెస్ట్‌ విషెస్‌. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి బెస్ట్‌ ఆఫ్‌ లక్‌. ఇందులో ఒక్కరి కల నెరవేరినా ఈ వెబ్‌ సైట్‌ లాంచ్‌ చేయడానికి న్యాయం జరిగినట్టే. దిల్‌ రాజు 14 మంది డైరెక్టర్స్‌ని లాంచ్‌ చేశారు. ఈ వేదిక ద్వారా చాలా మంది నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్‌, ప్రొడ్యూసర్స్‌ని లాంచ్‌ చేయబోతున్నారు. ఇంత అద్భుతమైన ప్లాట్‌ ఫామ్‌ క్రియేట్‌ చేసిన దిల్‌ రాజుకి అభినందనలు’ అని అన్నారు.
‘ఒక క్రియేషన్‌ ఒకరి కల. ఆ కలని సాకారం చేసుకోవడానికి సపోర్ట్‌ చేసేవారికంటే నిరుత్సాహపరిచే వారు ఎక్కువ మంది ఉంటారు. అయితే మన పక్కనున్న వాళ్ళు మనల్ని నిరత్సాహపరిస్తే మనలో ఒక ఫైర్‌ రావాలి. ఎంతమంది నిరుత్సాహపరిచినా మీ కలని మీరు నమ్మితే ముందడుగు వేసుకుంటూనే వెళ్ళండి. ఎవరు ఆపలేరు. దానికి బిగ్గెస్ట్‌ ఎగ్జాంపుల్‌ దిల్‌ రాజు, శిరీష్‌, విజరు దేవరకొండ.. మన కలని, మన లక్ష్యాన్ని మనమే నమ్మాలి. దిల్‌ రాజు డ్రీమ్స్‌ అనేది ఒక అద్భుతమైన వేదిక. యాక్టర్స్‌, డైరెక్టర్స్‌, టెక్నీషియన్స్‌తో పాటు ప్రొడ్యూసర్స్‌కి కూడా ఒక కాలమ్‌ కేటాయించడం గొప్ప విషయం. ఇలాంటి వేదిక నేను ఇదివరకు ఎక్కడా చూడలేదు. ఇది మీ అందరికీ ఒక గొప్ప ఫ్లాట్‌ ఫామ్‌. సక్సెస్‌ అనేది మన అల్టిమేట్‌ టార్గెట్‌గా పెట్టుకోవాలి’ అని దేవిశ్రీప్రసాద్‌ చెప్పారు. ప్రొడ్యూసర్‌ శిరిష్‌ మాట్లాడుతూ,’ఇక్కడికి ఎంతోమంది టాలెంట్‌ ఉన్న వాళ్ళు వచ్చారు. మీ ట్యాలెంట్‌తో ఎదిగిన తర్వాత ఇండిస్టీని మర్చిపోవద్దు. ఇది ప్రామిస్‌ చేసి ఎంటర్‌ అవ్వండి. మీరు సక్సెస్‌ అవుతారు’ అని తెలిపారు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద ‘దిల్‌’ సినిమా తర్వాత ఎంతోమంది కొత్త దర్శకుల్ని లాంచ్‌ చేసాం. వాళ్ళు ఈరోజు సక్సెస్‌ఫుల్‌ డైౖరెక్టర్స్‌గా ఇండిస్టీలో ఉన్నారు. మా బ్యానర్‌లో 57 సినిమాలు పూర్తయ్యాయి. హర్షిత్‌, హన్సిత దిల్‌ రాజు ప్రొడక్షన్‌ బ్యానర్‌ పెట్టి బలగం వేణుతో పాటు నలుగురు కొత్త దర్శకుల్ని పరిచయం చేశారు’ అని దిల్‌ రాజు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -