- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపల గుర్తు తెలియని దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత ముంబై జుహులోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను మోహరించారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశం ఇంకా తెలియరాలేదని, నిందితులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
- Advertisement -



