నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సోమవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు, వారి కుటుంబానికి బస్ సౌకర్యం, వారికి నెలకు రూ.25 వేల పింఛను ఇవ్వాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కొరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ , భువనగిరి మండలం అధ్యక్షులు కొండాపురం శ్రీనివాస్, మంటి లింగయ్య, సంగిచెట్టి జనార్ధన్, గడ్డం మీది పరశురాం, గంధ మల్ల శ్రీనివాస్, చేర్యాల సుగుణమ్మ గంధ మల్ల గోపాల్, అబ్బ స్వామి లు పాల్గొన్నారు.
కలెక్టర్ కు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వినతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES