Tuesday, June 24, 2025
E-PAPER
Homeజాతీయంసీటు విషయంలో బీజేపీ ఎమ్మెల్యేతో వివాదం

సీటు విషయంలో బీజేపీ ఎమ్మెల్యేతో వివాదం

- Advertisement -

– వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి
భోపాల్‌:
సీటు మారేందుకు నిరాకరించిన వ్యక్తిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరు లు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ-భోపాల్‌ వందేభా రత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికుడిపైనే తిరిగి కేసు బనాయించడం గమనార్హం.
అసలేం జరిగింది..?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్‌ సింగ్‌ గత వారం తన సొంత నియోజకవర్గానికి కుటుంబ సభ్యులతో కలిసి వందే భారత్‌లో ప్రయాణించారు. ఈ క్రమంలో భార్య, కుమారుడికి కంపార్ట్‌మెంట్‌ ముందు వరుసలో సీట్లు రాగా.. ఎమ్మెల్యేకి వేరే చోట సీటు వచ్చింది. ఈ క్రమంలో తన భార్యాబిడ్డలతో కలిసి ప్రయాణించేందుకు ఆ పక్కనే ఉన్న ప్రయాణికుడిని ఎమ్మెల్యే కోరగా.. అందుకు నిరాకరించాడు. ఇది జరిగిన కాసేపటికే ఝాన్సీ స్టేషన్‌లో ఎమ్మెల్యే మనుషులు ట్రైన్‌ ఎక్కి ఆ ప్రయాణికుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆరుగురు వ్యక్తులు ప్రయాణికుడిని సీట్లోనే చెప్పులతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -