- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
పశువైద్య , పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బాల్కొండ మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో బుధవారం నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 1137 మేకలు గొర్రెలకు సరిపడా మందులు పంపిణీ చేసినట్లు పశువైద్య అధికారి డా. ఉజ్వల తెలిపారు. ఈ మందులను గ్రామ సర్పంచ్ పోలేపల్లి హేమలత లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ ఎంబరి నర్సయ్య చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవాల పెంపకం దారులు చిన్న మల్లయ్య, మహేందర్, నాగేష్, మనీష్, గోపాలమిత్ర షకీల్ , బషీర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



