విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
మండల ప్రత్యేక అధికారి జినుగు మరియాన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల చదువుతున్న విద్యార్థినిలకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు ఆ పాఠశాల సందర్శించి దుప్పట్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించామని మండల ప్రత్యేక అధికారి మరియన్న తెలిపారు. ఈ సందర్శనలో పాఠశాలలో అందిస్తున్న విద్యా, వసతి, భోజన సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. అలాగే మానసిక ఆరోగ్య, క్రీడలు, వ్యాయామం లాంటి తదితర అంశాలు పై కూడా విద్యార్థులకు నిత్య అవగాహన చేయాలని తెలిపారు.
అధికారులు విద్యార్థులు మరియు సిబ్బందికి వ్యాధులు ప్రబలకుండా నీటి పరిశుభ్రత పాటించడం, పాఠశాలలో నీరు నిల్వ ఉండనివ్వకపోవడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం, శుభ్రమైన ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు నివారించవచ్చని విద్యార్థులకు వివరించారు. అలాగే, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనపడితే వెంటనే ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని సూచించారు, స్వీయచికిత్స చేయరాదని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాద్యాయురాలు సుమలత, ఉపాద్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



