- Advertisement -
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని బీరెల్లి లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్ 75 వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకం వల్ల పేదలకు ఎంతో ఆర్థిక మేలు జరుగుతుందన్నారు. వేలాదిమంది పేద మధ్యతరగతి ప్రజలకు (రోగులకు) సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేతను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మొక్కటి కోటి, సీనియర్ నాయకులు దాయ వెంకటేశ్వర్లు (కోడి), వంగరి సదయ్య, గోసంగి స్వామి, వంగరి రమేష్, కాళేశ్వరం సదానందం, నరసింహ చారి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -