Sunday, June 1, 2025
E-PAPER
- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని బోర్గం (కే) గ్రామంలో బాధితులకు సిఎం అర్ ఎఫ్ చెక్కులను పంపిణీ శుక్రవారం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు బాధితులకు చెక్కులను అందజేశారు. బాధితుల   కుమ్మరి సాయన్న రూ. 33 వెలు, కుమ్మరి పోతన్న రూ.20500,  నేహా ఫిర్ధొస్ రూ.51 వెయ్యి, కాసుల సహస్ర రూ.6 వెలు చొప్పున చెక్కులను అందజేశారు. నలుగురు  మంది లబ్దిదారులకు మొత్తం  రూ.110500  విలువగల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి చెక్కుల అందజేతకు ఎమ్మెల్యే పైడి రాకేష్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు మట్ట చరణ్, రాంపురo శ్రీనాథ్,మహేష్, రాంపురo ఠాగూర్, యోగేష్, ఉమేష్, నరేష్ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -